అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తాం

We will implement welfare schemes for all the eligible people
We will implement welfare schemes for all the eligible people

గ‌త ప్ర‌భుత్వం ప‌దేళ్ల‌లో ఒక్క కొత్త రేష‌న్ కార్డు ఇవ్వ‌లేదు
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తాం
ఖేడ్ ఎమ్మెల్యే డా.సంజీవ‌రెడ్డి
నారాయణఖేడ్[narayangkhad] జనవరి 24 (సిరి న్యూస్)
నాగల్ గిద్దా మండల పరిధిలోని కారస్ గుత్తి గ్రామంలో శుక్రవారం ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్, నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవ రెడ్డి.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిరుపేద అర్హులైన వారికి పథకం అమలు చేస్తాంఅని ఎమ్మెల్యే అన్నారు.
తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరంలో 16 వేయిల కోట్ల మిగులు బడ్జెట్ తో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అప్పజెప్పారు. కానీ ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి 7 లక్షల కోట్ల అప్పుతో మన కాంగ్రెస్ ప్రభుత్వ అప్పజెప్పారు. రాష్ట్రన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చారు. ఎంతో మంది కాంట్రాక్టర్ లకు బిల్లు కూడా ఇవ్వకుండా మన నెత్తిన పెట్టీ వెళ్ళారు కావున వారు. చేసిన అప్పులకు మిత్తిని కడుతూ ప్రజలకు కావలిసిన పథకాలను ప్రజలకు అందివ్వడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, పేద ప్రజలకు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. గత పది సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డులను ఇవ్వలేదు ఎమ్మెల్యే అన్నారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడి తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందివ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం గ్రామంలోని రైతు బీమా లబ్ధిదారులకు చెక్కులను అందిఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల త‌హ‌సిల్దార్‌, ఎంపిడివో శంకరయ్య స్వామి మాజీ ఎంపీపీ,మాణిక్ రావు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, గుండే రావు పాటిల్,ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్,శ్రీకాంత్ పీఏసీఎస్ ఛైర్మెన్,సచిన్ పాటిల్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు,వినోద్ పాటిల్, రమేష్ చౌహాన్,అశోక్ రెడ్డి పీఏసీఎస్ ఛైర్మెన్ పండరి నాథ్ మాజీ ఎంపిటిసి,నారాయణ జాదవ్,విఠల్ రెడ్డి, సోపన్ రావు, అంబ్రెష్,రూఫ్ సింగ్ మంజి జడ్పీటీసీ,ఆకాశ్ రావు పాల్గొన్నారు.