ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతుల మెరుగు ప్రత్యేక చర్యలు -దామోదర్ రాజనర్సింహ

రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సైన్స్ టెక్నాలజీ శాఖ మాత్యులు దామోదర్ రాజనర్సింహ.
మునిపల్లి, రాయికోడ్ మండలాలలో మంత్రి సుడిగాలి పర్యటన
బుదేరా సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ డిగ్రీ పీజీ కళాశాల తనిఖీ
నిర్మాణం పనుల పరిశీలన. తాటిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పరిశీలన
అభివృద్ధి పనులు నాణ్యతతో జరగాలి అధికారులను ఆదేశించిన మంత్రి

సంగారెడ్డి, జనవరి 20 ( సిరి న్యూస్ ) : అందోల్ నియోజకవర్గం లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల మెరుగు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని మునిపల్లి, రాయికోడ్ మండలాలలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించారు. ఈ సందర్భంగా బుదేరాలోని సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ డిగ్రీ పీజీ కళాశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో జరుగుతున్న అదనప తరగతి గదుల నిర్మాణం పనులను, డ్రైనేజీ పనులను, క్రీడామైదాన నిర్మాణ పనులను, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను, అంతర్గత సిసి రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. విద్యాసంస్థలు జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలని అధికారులను గుత్తేదారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలో బాలికల విద్య ప్రోత్సాహానికి చర్యలు
చేపట్టామన్నారు.

అనంతరం తాటిపల్లి గ్రామంలోని కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించారు. కేజీబీబీ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో పాఠశాల అభివృద్ధిపై మంత్రి చర్చించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను సి ఎస్ ఆర్ నిధులతో చేపడతామన్నారు . కేజీబీవీ పాఠశాలలో వంటగదిని పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు విశాలమైన డైనింగ్ హాల్ నిర్మాణం డిజిటల్ క్లాస్ రూమ్ లో ఏర్పాటు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు అదనపు తర్వాతి గదుల నిర్మాణం పేరెంట్స్ వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులను సిఎస్ఆర్ నిధులతో చేపట్టనున్నట్లు మంత్రి విద్యార్థులకు ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు .

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి, డీఎస్పీ సత్తయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నర్సింలు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇతరులు పాల్గొన్నారు.