16 మంది బాలురు,16 మంది బాలికలను తుది జట్టుకు ఎంపిక చేశాం
జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి గంగాల రమేష్
మాసాయిపేట జనవరి 7 సిరి న్యూస్
మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లో ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ 14 బాల బాలికల సాప్ట్ బాల్ జట్ల ఎంపిక స్థానిక ఉన్నత పాఠశాల మైదానం లో నిర్వహించినట్లు మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి గంగాల రమేష్ తెలిపారు.ఈ ఎంపిక ప్రక్రియ లో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి సుమారు 40 బాలురు, 30 మంది బాలికలు హాజరయ్యారని తెలిపారు.ఉత్తమ ప్రతిభ కనపర్చిన 16 మంది బాలురు,16 మంది బాలికలను తుది జట్టు కు ఎంపిక చేశామని తెలిపారు.
ఈ జట్లు మెదక్ జిల్లా లో నిర్వహించే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ సాప్ట్ బాల్ అండర్ 14 బాల బాలికల చాంపియన్షిప్ పోటీలో పాల్గొంటారని తెలిపారు.ఎంపిక కార్యక్రమానికి మాసాయిపేట మండల విద్యాధికారి శ్రీమతి లీలావతి ముఖ్య అతిథి గా హాజరయ్యారని తెలిపారు.కార్యక్రమం లో మాసాయిపేట స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ధర్మ పురి గారు,వ్యాయామ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ నాగరాజు గారు,స్థానిక ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీ శ్యాం సుందర్ శర్మ గారు , పద్మ గారు, రాజ్ కుమార్ గారు,కోచ్ రేణుక గారు మరియు వివిధ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.