బి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం…
శివపేట్ జనవరి 8 (సిరి న్యూస్ )
మెదక్[medak] జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలలో[In Gram Panchayats]పని చేస్తున్న కార్మికులకు పెండింగు లో ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్య పాత్ర వహిస్తున్న కార్మికులకు నెల నెల జీతాలు చెల్లించకపోవడం సరికాదాన్నారు. రాష్ట్రoలోని ప్రజలందరూ ఓ వైపు సంక్రాంత్రి పండుగ జరుపుకోవడానికి సిద్దమైతున్న వేళ గ్రామ పంచాయితీ కార్మికులకు జీతాలు రాక పూట గడవడం కష్టంగా మారడం బాదాకారం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయితీ కార్మికుల జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా వారికి ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని ఈ సందర్బంగా కోరారు.