- జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 హైవే హైదరాబాద్ టు నాగపూర్ రోడ్డు..
- బొమ్మరం ఎక్స్ రోడ్ చౌరస్తా దగ్గర టిఫిన్ సెంటర్ ఇరువైపులా వాహనాలు ఆపడంతో యాక్సిడెంట్..
మాసాయిపేట : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం శివారులో స్టేషన్ మాసాయిపేట బొమ్మరం ఎక్స్ రోడ్డు చౌరస్తా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రాంతనికి ఎక్కువగా ప్రజలు టిఫిన్ చేయడానికి వస్తారు. ఈ మేరకు అధిక సంఖ్యలో బండ్లు ఆగడం వల్ల రోడ్డు ప్రమాదలు సంభవిస్తున్నాయి. ఈ విషయంపై ఎన్నిసార్లు జిఎంఆర్కు సమస్య విన్నవించిన రోడ్డు ప్రక్కన ఉన్న టిఫిన్ సెంటర్లను వారు పట్టించుకోవడం లేదు.
అధికారులకు తెలిపిన గాని వారి దగ్గర నెలసరి కమిషన్లు తీసుకొని మూడు పువ్వులు ఆరు కాయలు లాగా జిఎంఆర్ అధికారులు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఎందరో ప్రాణాలు బొమ్మరం ఎక్స్ రోడ్ చౌరస్తా దగ్గర పోయిన సంఘటనలు ఉన్నాయి. అనంతరం గాయాలతో బ్రతికి బయట పడిన సందర్భాలు ఉన్నాయి. అని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు టిఫిన్ చేయడానికి ఇరువైపులా వాహనాలు ఆపడంతో ద్విచక్ర వాహనదారులు యాక్సిడెంట్ కావడంతో అధికంగా గాయాలు కావడంతో రోడ్లపై వారు చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ఇప్పటికైనా జిఎంఆర్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.