తాసిల్దార్ సత్యనారాయణ
సిరి జనవరి25,
ఓటు హక్కు పౌరులకు వజ్రాయుధం లాంటిదని చేగుంట[chegunta] తాసిల్దార్ సత్యనారాయణ అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రం నుండి గాంధీ చౌక్ వరకు టూ కె రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య నిర్మాణంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఓటు ద్వారా అవినీతి లేని పాలనను నిర్మించుకోవచ్చు అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థి దశ నుండే ఓటు , ప్రజాస్వామ్య విలువలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. గాంధీ ఎదుట మహిళా సంఘాలు సభ్యులు,అంగన్వాడి టీచర్లు, ఈ కార్యక్రమంలో , వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు