అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

MLA who started the ambulance
MLA who started the ambulance

నారాయణఖేడ్ (సిరి న్యూస్)

సిర్గాపూర్ మండల కేంద్ర పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు నూతన 108 అంబులెన్స్ ను ప్రారంభించిన నారాయణఖెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రి లో ఇన్ పేషంట్, అవుట్ పేషంట్ల బుక్కును పరిశీలించారు. తర్వాత రోగుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్యం క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యం పట్ల ఎంతో శ్రద్ధతో ప్రతి ఒక్క పేదవాడికి మంచి వైద్యం అందించాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళుతుందని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రి వైద్య సిబ్బందికి గ్రామాల నుండి అమాయకమైన ప్రజలు ఆసుపత్రికి వస్తుంటారు. వారిని ప్రేమతో పలకరించి సరైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు యాదవ రెడ్డి, మాజీ సర్పంచ్,మహేశ్వర్ సెట్,సల్మాన్, జ్ఞానేశ్వర్, విఠల్ రావు,పీరప్ప మాజీ ఎంపీటీసీ, సుభాష్, సాయిలు, లక్ష్మయ్య, అనంత్ రెడ్డి,శుభాష్,జైరాజ్,తదితర ముఖ్యనాయకులు మరియు ఆసుపత్రి వైద్యులు 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.