జనవరి 29 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
ఆయనతో బాగా పరిచయం ఉన్న వాళ్లు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ పోలీస్ అధికారి పేరు తిరుపతన్న. ఫోన్ టాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన పది నెలలుగా జైల్లో ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు బేర్ ఇచ్చింది. దీంతో ఆయన చంచల్గూడా జైలు నుంచి విడుదలయ్యారు. 10, నెలలుగా జైల్లో ఉన్న తిరుపతన్న గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. గతంలో ఆయన సంగారెడ్డి డిఎస్పీగా పనిచేశారు. అనంతరం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఫోన్ టాపింగ్ అంశంలో కీలకంగా ఉన్నారని ఆరోపణలతో అరెస్టయ్యారు.