రామాయంపేట ఫిబ్రవరి 5 (సిరి న్యూస్)
రామాయంపేట పట్టణంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి రాధా కిషన్ బుధవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు.పదవ తరగతి విద్యార్థులకు జరుగుతున్న క్లాసులను అయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు వారిని తీర్చిదిద్దాలని తెలిపారు.అదేవిధంగా పదో తరగతి ఫిజిక్స్ క్లాస్ రూమ్ లో విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి ఆయన సమాధానాలు రాబట్టారు.మొత్తం మీద వచ్చే పదవ తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ఉదయం సాయంత్రం వేళలో జరుగుతున్న స్పెషల్ క్లాసులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం స్నాక్స్ అందజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమ, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.