పాల్గొన్న సంగారెడ్డి[sangareddy]జిల్లా అధ్యక్షులు శివ శంకర్ రావు ,జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం
శివంపేట్ [shivampet]జనవరి 20 ( సిరి న్యూస్ )
భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటి 2025 నూతన సంవత్సరం క్యాలెండరును హైదరాబాద్ లోని బిఆర్ఎస్ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాలు అన్ని రంగాల కార్మికులను కె సి ఆర్ ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుందని అన్నారు.ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఇప్పటి ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు రెండు మూడు నెలలకొకసారి కూడా జీతాలు విడుదల చేయడం లేదన్నారు. ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల రెండు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ ,ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య , కనీస వేతనాల బోర్డు సలహా మండలి మాజీ చైర్మన్ నారాయణ , సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శివ శంకర్ రావు,*బి ఆర్ టి యు రాష్ట్ర కమిటి క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం , అన్ని జిల్లాల బి ఆర్ టి యు అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.