నారాయణఖేడ్ [Narayankhed]జనవరి 22 (సిరీ న్యూస్)
మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి,ని బుధవారం నాడు ఆశా వర్కర్లు కలుసుకొని వారి బాధ, గోడును వెల్లబోసుకున్నారు.ఆశా వర్కర్లు కు గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, హయాంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు రూ.2500 జీతం వచ్చేది. టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ మా జీతాన్ని రూ.9000 పెంచారు. అని ఆశ వర్కర్లు గుర్తు చేశారు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాకు 9000 రూపాయలు ఉన్న జీతాన్ని రూ.18000 పెంచుతామని చెప్పి ఎన్నికలు గడిచి సంవత్సరం దాటుతున్న ఇంకా పెంచలేదు. మా గురించి పట్టించుకోక పోగా మమ్మల్ని కలిసి మాట్లాడే టైం కూడా ఇవ్వటంలేదు. అని అన్నారు.కెసిఆర్ రూ.9000 పెంచారు కదా వీళ్లు కూడా మా జీతాన్ని రూ.18000 పెంచుతారని నమ్మి వీళ్ళకి ఓట్లు వేసి మేము పెద్ద తప్పు చేసాము సార్ మమ్మల్ని వీలు మోసం చేశారన్నారు.వచ్చే ఎన్నికల్లో మేమందరం కలిసికట్టుగా పనిచేసి మరలా కెసిఆర్ నే ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ జిల్లా కో ఆప్షన్ సభ్యులు డాక్టర్ ఆలీ, మాజీ సర్పంచ్ పండరి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ రామ్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు రాములు, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పిరయ్య, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, చంద్రప్ప, హనుమాన్లు, వెంకయ్య, తదితరులు ఉన్నారు.