ప‌దేళ్ల‌లో బీఆర్ఎస్ చేయ‌లేనిది ఒక్క ఏడాదిలో చేసి చూపించాం

నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవ రెడ్డి

నాలుగు నూత‌న ప‌థ‌కాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ

పెద్ద శంకరంపేట, జ‌న‌వ‌రి 26 (సిరి న్యూస్): పెద్ద శంకరం పేట మండలం లోని దానం పల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అధికారులు, స్థానిక నాయకులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించి, పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు మంజూరి పత్రాలను పంపిణీ చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేస్తున్నామని, ప్రభుత్వం పదేళ్ల కాలం లో చేయలేనిది ఒక సంవత్సర కాలంలోనే చేసి చూపించామని అన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి చిప్ప చేతికిచ్చిన, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ 50వేల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని,రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, ఇంకా కొంత మందికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వలన కొంతమంది అవ్వాల్సింది వారిని కూడా గుర్తించి తప్పకుండా రుణ మాఫీ చేస్తామన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మండల ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, మరియు దానం పల్లి గ్రామ ప్రజలు, పెద్దలు, నారా గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.