రామయంపేట జనవరి 4 (సిరి న్యూస్) : దేశంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) ద్వారా రైతులకు, వ్యాపారస్తులకు, చిరు మధ్యతరగతి వారికి ఆలస్యం లేకుండా సకాలంలో రుణాలను మంజూరు చేస్తున్నామని ఆ బ్యాంకు హైదరాబాద్ జోన్ ఆధిపతి ధారా సింగ్ నాయక్ (Hyderabad Zone Head Dhara Singh Naik) వెల్లడించారు. బ్యాంకు ద్వారా అందించే రుణాలతో వ్యాపారాలు అభివృద్ధి చేసుకొని బ్యాంకు ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సెంట్రల్ బ్యాంక్ హెడ్ ధారాసింగ్ నాయక్ అన్నారు.
రామాయంపేట మండల కేంద్రంలో శనివారం నూతన బ్యాంకు భవనాన్ని ఆయన ప్రారంభించారు. రామాయంపేటలో 1971లో సెంట్రల్ బ్యాంక్ ప్రారంభించామని,నేటికి 43 సంవత్సరాలు పూర్తయిందని, 90 కోట్ల టర్నోవర్ తో బ్యాంకు ముందుకు సాగుతుందని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చామని, ఈ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా ఖాతాదారులను సాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ హెడ్ కృష్ణమోహన్, బ్యాంకు మేనేజర్ డి.బీముడు నాయక్, మున్సిపల్ కౌన్సిలర్ దేమే యాదగిరి, ఖాతాదారులు ఎన్ని శెట్టి సంతోష్, పబ్బ చంద్రం, బ్యాంకు సిబ్బంది జన్ను ప్రసాద్, భరద్వాన్ పాన్ లాల్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి సెంట్రల్ బ్యాంకు మేనేజర్ లు తదితరులు పాల్గొన్నారు.