డంపియాడ్ ఏర్పాటు వల్ల ప్రజలకు ఎలాంటి హాని ఉండదు..

There will be no harm to people due to the establishment of dumpiad.
There will be no harm to people due to the establishment of dumpiad.

జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్..

గుమ్మడిదల రూరల్ : డంప్ యార్డ్ వల్ల ప్రజలకు ఎలాంటి హాని ఉండదని జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం గుమ్మడిదల మండల పరిధిలోని నల్లవల్లి బస్టాండ్ వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యారా నగర్ లో నూతనంగా నిర్మాణం చేపడుతున్న డంపు యాడ్ పై ప్రజలకు ఎలాంటి హాని ఉండదని తెలిపారు.

ఈ డంప్ యార్డ్ నిర్మాణం కోసం 2008 2009లో జవహర్ నగర్ లకడారం ప్యారా నగర్ మూడు ప్రాంతాలలో గుర్తించామని తెలిపారు. సారా నగర్ లో 150 ఎకరాలకు సంబంధించిన భూమిని 2017 వ సంవత్సరంలో రెవెన్యూ అధికారుల నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డంప్ యార్డ్ నిర్మాణం కోసం 2003లో ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయని తెలిపారు. యూరోపియన్ టెక్నాలజీతో ఈ డంపు యాడ్ నిర్మాణాన్ని చట్ట ప్రకారమే నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు 130 వాహనాలలో 200 టన్నుల వేస్టేజ్ ఈ ప్యారా నగర్ డంప్యాడ్ కేంద్రానికి వస్తుందని తెలిపారు. అడిషనల్ ఎస్పీ సంజీవరావు, తహసిల్దార్ గంగాభవాని, ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.