జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్..
గుమ్మడిదల రూరల్ : డంప్ యార్డ్ వల్ల ప్రజలకు ఎలాంటి హాని ఉండదని జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం గుమ్మడిదల మండల పరిధిలోని నల్లవల్లి బస్టాండ్ వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యారా నగర్ లో నూతనంగా నిర్మాణం చేపడుతున్న డంపు యాడ్ పై ప్రజలకు ఎలాంటి హాని ఉండదని తెలిపారు.
ఈ డంప్ యార్డ్ నిర్మాణం కోసం 2008 2009లో జవహర్ నగర్ లకడారం ప్యారా నగర్ మూడు ప్రాంతాలలో గుర్తించామని తెలిపారు. సారా నగర్ లో 150 ఎకరాలకు సంబంధించిన భూమిని 2017 వ సంవత్సరంలో రెవెన్యూ అధికారుల నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డంప్ యార్డ్ నిర్మాణం కోసం 2003లో ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయని తెలిపారు. యూరోపియన్ టెక్నాలజీతో ఈ డంపు యాడ్ నిర్మాణాన్ని చట్ట ప్రకారమే నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు 130 వాహనాలలో 200 టన్నుల వేస్టేజ్ ఈ ప్యారా నగర్ డంప్యాడ్ కేంద్రానికి వస్తుందని తెలిపారు. అడిషనల్ ఎస్పీ సంజీవరావు, తహసిల్దార్ గంగాభవాని, ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.