ఘనంగా ఎల్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట

ప్రత్యేక పూజలు నిర్వహించినఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్

కౌడిపల్లి ఫిబ్రవరి 4 (సిరి న్యూస్) : మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట లో భాగంగా మంగళవారం నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.అతిధులకు శాలువాలతో సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించిన గౌడ సంఘం సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఆలయానికి భూదానం చేసిన సారా అనంత రామ గౌడ్ ని అభినందించారు.అలాగే అనంత రామా గౌడ్ ఆలయం ప్రక్కన శివాలయం నిర్మాణానికి 1లక్ష 16 వేల రూపాయలు విరాళం అందజేస్తానని సభాముఖంగా ప్రకటించడంతో ఆవుల రాజి రెడ్డి అనంతరామ గౌడ్ ని అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, తిమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వెంకట్, గౌని అంజాగౌడ్, మాజీ సర్పంచ్ పద్మ కిష్టయ్య, సురేష్ ,బాలరాజ్ శ్రీనివాస్ గౌడ్, శేఖర్ గౌడ్ మండల యూత్ అధ్యక్షుడు దన్ సింగ్ నాయక్ , మల్లేశం గౌడి మల్లేశం, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిమ్మాపూర్ గౌడ సంఘం సభ్యులు భక్తులు పాల్గొన్నారు.