రామాయంపేట క్రీడకారులకు నెలవు
ఎల్లవేళలా క్రీడలకు క్రీడాకారులకు చేయూతనిస్తా..
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
ప్రాథమిక విలువిద్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన హనుమంతరావు
రామాయంపేట జనవరి 7 సిరి న్యూస్ : ఆటలు ఆరోగ్యానికి మానసిక వికాసానికి ఎంతో తోడ్పడతాయని ప్రతి ఒక్కరూ ఆటలను సాధన చేయాలని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే అయిన మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumanth Rao) అన్నారు రామాయంపేట పట్టణానికి చెందిన యువజ్యోతి ఆర్చరీ ,ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రాథమిక విలువిద్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరమైన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సాధన చేసి రామాయంపేట మెదక్ పట్టణాలకే కాకుండా రాష్ట్రానికి కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో విలువిద్యలో మరి ఫుట్బాల్లో పేరు తీసుకురావాలని ఆయన అన్నారు సంబంధం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు క్రీడలు సాధన చేయడం వల్ల ఆరోగ్యం మరియు మానసిక శక్తి పెరుగుతుంది అన్నారు.
ఒత్తడి లేక గెలుపు ఓటముల పై అవగాహన పెరుగుతుందన్నారు సీఎం రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ప్రతిభ కనబరిచి నా కస్తూరి హర్షవర్ధన్ ఆయన ప్రశంసించారు జాతీయస్థాయిలో ఫుట్బాల్ క్రీడాకారుడు శరత్చంద్ర బుల్లెట్ ను కూడా ఆయన ఆశీర్వదించారు హైదరాబాద్ ఫుట్బాల్ టోనీలో ప్రతిభ చూపిన యువజ్యోతి క్రీడాకారులు పాటు భానుదాస్ అభిరామ్ గోపాలస్వామి తదితరులకు క్రీడా ధృవపత్రాలు అందజేశారు అంతకుముందు ఆయన శివ జ్యోతి ఆర్చరీ ప్రాథమిక శిక్షణ కేంద్రాన్ని బాణం వేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాతం రావు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు పుట్టి రాజు శ్రీధర్ రెడ్డి శివ ప్రసాద్ రావు శంకరయ్య కుమార్ సాగర్ మార్నింగ్ స్టార్స్ రామాయంపేట క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బసనపల్లి మల్లేష్, రెడ్డమైన నరేష్, చింతల స్వామి బాలకృష్ణ, సుంకోజి దామోదర్, అమరేందర్ రావు, దోమకొండ యాదగిరి, నమూళ్ళ సందీప్ పాల్గొన్నారు.