ఎలాంటి పొరపాట్లు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
జిల్లాలోని ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
సంగారెడ్డి, జనవరి 6 సిరి న్యూస్ : జిల్లాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే పై అధికారులతో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వే పగడ్బందీగా నిర్వహించాలని మండల అధికారులను ఆదేశించారు .సొంత స్థలం ఉన్న అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రాధాన్యాతా క్రమం లో మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆయా మండలాలలో జరుగుతున్న సర్వే పైన మండల ఆధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3500 ఇండ్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు . అర్హులైన నిరుపేదలకు ఖాళీ స్థలం ఉన్న వారికి మొదటి విడత లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ఇంటింటి సర్వే జరుపుతున్నట్లు తెలిపారు. సర్వేలో ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేని వారికి , ఇండ్లు కూలిపోయిన వారికి, ఇల్లు శిథిలావస్థలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ట్రైనింగ్ కలెక్టర్. మనోజ్ హౌసింగ్ పీడీ. చలపతి, జెడ్పి సీఈవో జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.