అర్హులందరికీ పథకాలు వర్తింప చేయాలి -జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
హత్నూర, జనవరి 17 సిరి న్యూస్ః
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి వర్తించేలా సంక్షేమ పథకాల జాబితాను పకడ్బందీగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం హత్నూర మండలం గుండ్ల మాచూర్ గ్రామంలో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల సర్వేలో ఆయన పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా జాబితాలో పేర్కొన్న వివిధ పథకాలను లబ్ధిదారుల ఇంటి వద్దనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో సర్వేచేసి లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు లబ్దిదాల ఎంపిక ప్రభుత్వ నిబంధనలనకు లోబడి పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.వారి వెంట తాహసిల్దార్ ఫర్హిన్ షేక్, ఎంపీడీవో శంకర్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు,ఎంపీవో యూసుఫ్,ఆర్ ఐ శ్రీనివాస్, సర్వాయర్ శ్రీనివాస్, నాయకులు శశిధర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.