ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ క్రాంతి వల్లూరు

Collector Kranti Vallur
Prajavani complaints should be resolved promptly : Collector Kranti Vallur

సంగారెడ్డి : ప్రజావాణి కార్యక్రమానికి( Prajavani program) ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు(Collector Kranti Vallur) అధికారులను ఆదేశించారు. ఈరోజు (సోమవారం) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందాయి.

ఈ మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు వారి సమస్యలను కలెక్టర్ క్రాంతి వల్లూరు తన ఛాంబర్‌లో స్వీకరించారు. మరోవైపు సమావేశమందిరంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డి ఆర్ ఓ పద్మజ రాణి అర్జీలు కూడా ఈ ఫిర్యాదులను స్వీకరించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ.. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.