చిలిపిచేడ్ బిజెపి మండల అధ్యక్షుడు నగేష్
బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
చిలిపిచేడ్ ఫిబ్రవరి 4 సిరి న్యూస్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను తప్పుపడుతూ కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టడం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే అని చిలిపిచేడ్ మండల బిజెపి అధ్యక్షుడు నగేష్ అన్నారు. మంగళవారం చిలిపిచేడ్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నగేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు బిజెపి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తుందని ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా చూడడం కేంద్రానికి అలవాటు లేదని ఆయా రాష్ట్రాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ కేటాయింపు చేసిందని, తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆ మాట అనగలరా ఆలోచించాలి.
ఆయుష్మాన్ భారత్ కింద కోట్ల నిధులను ఇస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం వెచ్చించే కోట్ల రూపాయల నిధులను ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వాడకూడదు అని ప్రశ్నించారు. ఇవే కాకుండా నిరుపేదలైన ప్రతి వ్యక్తికి ఉచిత రేషన్ బియ్యం, మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులతో పాటు గ్రామాలలో పారిశుద్ధ్యానికి మంచినీటికి గ్రామపంచాయతీలకు కోట్ల రూపాయల నిధులు కేంద్ర బడ్జెట్ లోనివి కావా?? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాంగ్రెస్ నాయకులకు తగదు అన్నారు. ఈ కార్యక్రమంలో చిలిపిచెడ్ మండల బిజెపి అధ్యక్షుడు నగేష్ , మెదక్ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మాజీ మండలం అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి బూత్ అధ్యక్షులు రాజ గౌడ్ శేఖర్ మైపాల్ యాదగిరి రాజు రవి తదితరులు పాల్గొన్నారు.