సదాశివపేట జనవరి 28( సిరి ) : పట్టణంలోని బిసి బాలుర వసతి గృహాన్ని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సోమవారం రాత్రి ఆకస్మిక తనకి చేసి ఆహార నాణ్యతను, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతి గృహ పరిసరాల్లో పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, వంటశాలలో పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పిల్లలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
వివిధ పాఠ్యాంశాలపై వారికి ఉన్న అవగాహనను వివిధ ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించి రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని శ్రద్ధగా చదవాలని సూచించారు. వసతి గృహంలోనే విద్యార్థులతో కలిసి రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీష్, వార్డెన్ కవిత, తదితరులు పాల్గొన్నారు.