ఎందుకీ జాప్యం?
బొంతపల్లి శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి ఆలయ కమిటీ ఏర్పాటులో నిర్లక్ష్యం
పాలకవర్గం ఏర్పాటైనా జరగని ప్రమాణ స్వీకారం
గుమ్మడిదల, జనవరి 17 సిరి న్యూస్
శైవ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం తేదీ ఖరారులో జాప్యం జరుగుతుంది. ప్రభుత్వం అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయినది. అయినప్పటికీ బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయ కమిటీ ఏర్పాటులో జాప్యం జరుగుతుంది. చైర్మన్ తోపాటు పాలకవర్గమును ఏర్పాటు చేసినప్పటికీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు. ప్రభుత్వం నుండి అధికారికంగా పాలకవర్గం ఎంపిక చేసినట్లు ఆదేశాలు అందలేవు. చాలా రోజులుగా ఆలయ కమిటీ లేకపోవడం అభివృద్ధికి నోచుకోకపోవడం జరుగుతుంది. పాలకవర్గం తేదీలను ప్రకటించి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భక్తులు, పార్టీ నాయకులు కోరుతున్నారు.