మహిళల విద్యా ప్రధాత సావిత్రిబాయి పూలే
ఆమె జయంతిని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయం
త్వరలోనే బిసి కమ్యునిటీ హాల్ భవనంకు నిధులు మంజూరు చేస్తా
మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
సావిత్రి బాయికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
టిపిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
మెదక్, జనవరి 3 సిరి న్యూస్ : మహిళల సమానత్వం కోసం వారి అభ్యున్నతి కోసం ఉద్యమం చేసిన సామాజిక విప్లవకారిణి, మహిళల విద్యా ప్రధాత సావిత్రిబాయి పూలే అని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ (MLA Dr. Mynampally Rohit) అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి (Savitribai Phule Jayanti) ని పురస్కరించుకొని టి.ఎన్.జి.ఓ. భవనంలో బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు నోముల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా సావిత్రిబాయి పూలే మహిళలకు విద్యను సులభతరం చేసేందుకు విశేషంగా కృషి చేశారని అన్నారు.విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు.
ఆమె “గో గేట్ ఎడ్యుకేషన్” కవిత ద్వారా అణగారిన వర్గాలకు విద్యాభ్యాసం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రోత్సహించిందన్నారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన ఆ మహనీయురాలు తర్వాత కాలంలో 17 పాఠశాలలను ప్రారంభించి మహిళా విద్యను ప్రోత్సహించిందని పేర్కొన్నారు.ఆమె సేవలను గుర్తించిన మన రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆమె జయంతి అయిన జనవరి 3వ తేదీని ప్రతి ఏట మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షనీయం అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతంర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ చంద్రపాల్, డిడబ్ల్యూఓ హైమావతి, బిసి కార్యదర్శి సుజాత, బిసి సంక్షేమ సంఘం నాయకులు అంకం చంద్రకళ, బొద్దుల క్రిష్ణ, భీమరి శ్రీనివాస్, శంకర్ గౌడ్, మల్లేశం, రమేశ్, సిద్దు తో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, బొజ్జ పవన్, న్యాయవాది జీవన్ రావ్, కౌన్సిలర్ లు దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, దాయర లింగం, ఆవారి శేకర్, రాగి అశోక్, గోదల సాయి, మేడి మదుసూదన్, టిఎన్జిఓ సంఘం బాధ్యులు దొంతి నరేందర్, షమి, హపీజ్ మోల్సాబ్, శేఖర్, సుప్రబాత్ రావ్, అమెర్, మన్సూర్, మైసన్, శ్రీకాంత్, ఉమర్ లతో పాటు తదితరులు పాల్గోన్నారు.
బిసి కమ్యూనిటీ హాల్ భవనం కు నిధులు మంజూరు చేస్తా
సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ కు బిసి సంక్షేమ సంఘం సభ్యులు బిసి కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం కు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే భవన నిర్మాణం కు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
బార్ అసోసియేషన్ భవనం కొరకు నిధులు మంజూరుకు విజ్ఞప్తి
మెదక్ విచ్చేసిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ కు మెదక్ బార్ అసోసియేషన్ సభ్యులు మెదక్ కోర్ట్ కాంప్లెక్స్ లో అసంపూర్తిగా ఉన్న బార్ అసోసియేషన్ (న్యాయవాదుల భవనం) కొరకు నిధులు మంజూరు చేయాలని మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె. సుభాష్ చంద్ర గౌడ్ , న్యాయవాదులు జీవన్ రావ్, పిడి ఆనందం రావ్, భీమరి గణేష్ లు వినతి పత్రాని అందజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నిధులను కేటాయిస్తానని హామినిచ్చారు.
టిపిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ..
మెదక్ పట్టణానికి విచ్చేసిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ శుక్రవారం టిపిటిఎఫ్ కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ తో పాటు డైరీని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంఘం బాధ్యులు ఎమ్మెల్యేకు శాలువాతో సత్కరించారు.