సదాశివపేట: శనివారం నాడు మార్కండేయ జయంతి సందర్భంగా సదాశివపేటలోని
పద్మశాలి మహిళలు భారీ ఎత్తున కలిశంబులు ఊరేగింపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విచ్చేసి ఈశ్వర్ మార్కండేయనికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కండేయని చల్లని కృప అందరిపై ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. మందిరం ఆలయ కమిటీ అధ్యక్షులు చిలువరి రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జనార్దన్, చేనేత సహకార సంఘం అధ్యక్షులు చింత ఆనంద్, మేనేజర్ చిల్వరి వెంకటేశం, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, గౌరవ అధ్యక్షులు అంబటి విశ్వనాథం, పెద్దలు చీకుర్తి అంబయ్య, గోనే శంకర్, మునిపల్లి రమేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్, ఆలయ కార్యకర్తలు సంకోరి శివకుమార్, రుమాళ్ళ రాజు తదితరులు పాల్గొన్నారు.