మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలలో పర్యటించి వారి గోస వినాలి

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయకపొవడం అన్యాయం
డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పెద్ద లింగన్న గారి శంకర్

గజ్వేల్ జనవరి 22 (సిరి న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,మంత్రుల‌తో పాటు మాజీ సిఎం కేసిఆర్‌లుమల్లన్నసాగర్ భూ నిర్వాసిత కాలనీ లలో పర్యటించి వారి గోస వినాలని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పెద్ద లింగన్న గారి శంకర్ డిమాండ్ చేశారు. బుధవారం రోజు దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో ఎర్రవల్లి నిర్వాసిత కాలనీలో వివిధ నిర్వాసిత కాలని బాధితులతో సమావేశం అనంతరం అంబేద్కర్ విగ్రహంముందు ధర్నా చేశారు.

ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ సమస్యల పై ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి హరిష్ రావు నిర్వాసితుల సమస్యల పై ప్రభుత్వాన్ని ప్రశ్నించక పోవడం దారుణమన్నారు. మల్లన్న సాగర్ లో 5,212 కుటుంబాలలో ఉపాధి హమీ జాబ్ కార్డు లు ఉన్నప్పటికి పనులు చూపలేదన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూములు స్వాధీనం చెసుకొవడంతో భూమి లేని వారిగా మారరన్నారు. ఉపాధి హమి పనులు చూపించక పొవడంతో పని లేక పస్తులు వుండాల్సిన దుస్థితి నేడు నెలకొన్నదని స్పష్టం చేశారు.

భూములు లేనందున ఉపాధి హమి పనిదినాల షరతును తొలగించి నిర్వాసితులందరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పధకాన్ని అమలు చేసి ఆదుకోవాల‌న్నారు. పెండింగ్ లో వున్న ఒంటరి మహిళలకు,యువజనులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ని అమలు చెయాల‌న్నారు.
ఈ కార్యక్రమం లో నిర్వాసి నాయకులు ముత్యాలమ్మ,లక్ష్మీ, నర్సవ్వ, శివకుమార్,కిషన్, నర్సింలు , అక్కారం మలయ్య, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

.