నారాయణఖేడ్: భారత జాతి పిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్బంగా కేటీఆర్ పిలుపు మేరకు. మాజీ ఎమ్మెల్యే ఆఫీస్ నుండి భారీ ఎత్తున బైక్ ర్యాలీగా వెళ్లి నారాయణఖేడ్ పట్టణంలోని బైపాస్ రోడ్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి.. వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, బిఆర్ఎస్ కార్యకర్తలు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేటీఆర్ పిలుపుమేరకు మహాత్మా గాంధీ కి వినతిపత్రం ఇస్తూ రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని కోరమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణా రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 420 రోజులు పూర్తి అయినా సందర్భంగా వారు ఇచ్చిన 420 హామీలలో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బుద్ధి ప్రసాదించాలనిమాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, రామ్ సింగ్, విట్టల్ రావు పటేల్, మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, కౌన్సిలర్ అభిషేక్ శెట్కర్, ముజామిల్,కో ఆప్షన్ సభ్యులు లాయక్, గోపాల్, మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు యాదుల్ల,గని, మండల పార్టీ ఉపాధ్యక్షులు నరసింహులు యాదవ్,మాజీ సర్పంచులు వెంకన్న, సంగప్ప,యాకూబ్, శ్యామ్,రాజు నాయక్, రాములు నాయక్, దత్తు, రాజు, సల్మాన్,సిద్దు,గోపి, నాయకులు కోణం అంజయ్య, నారాయణ, నరసింహ గౌడ్, గంగారెడ్డి, శ్రీధర్ పటేల్, మచ్చేందర్, బాలరాజ్ సాగర్, ప్రశాంత్ సాగర్, శంకర్ నాయక్, సర్దార్ నాయక్, శ్రీకాంత్, సాయి యాదవ్, సలీం, సురేష్, మల్లేష్, చింటూ, కర్ణం రాజు, వెంకటేశం తదితరులు ఉన్నారు.