ఖైదీల వసతి సౌకర్యాను పరిశీలించిన జిల్లా న్యాయ సేవాాధికార సంస్థ కార్యదర్శి బి.రమేశ్
సంగారెడ్డి, జనవరి 8 సిరి న్యూస్ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ , రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో లతో జిల్లా న్యాయ సేవాాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్ సెంట్రల్ జైలు (Inspection of Sangareddy Central Jail) కంది నందు తనిఖీ నిర్వహించడం జరిగింది.
ఈ తనిఖీ నందు న్యాయమూర్తి సెంట్రల్ జైలు నందు ఉన్న బ్రేరక్లు గదులు, వంట గది, మరియు బాత్రూంలు జైలు ఆవరణ మొత్తం తిరిగి పరిశీలించి ఖైదీలను జైలులో ఉన్న సదుపాయాలను, భోజనం గూర్చి అడిగి తెలుసుకున్నారు అన్ని ఖైదీలు బెరక్లూ క్షున్నంగా పరిశీలించి వారికీ కావాల్సిన అవసరాలు, సదుపాయాలు అన్ని అందించేలా చూడాలని జైలు సూపరింటెండెంట్ కి తెలియజేసారు. మరియు వారికీ ఖైదీలతో వారికీ సమయానికి బైల్స్, ములాఖత్ అందుతున్నాయ, కేసులు పరిష్కరించేందుకు న్యాయ సేవలు పొందేందుకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని ఖైదీలకు తెలియపరిచారు. ఖైదీలకు పెడుతున్న భోజనం రుచి చూడడం జరిగినది. ఖైదీల కోసం వన్డే కూరగాయలు, బియ్యం, ఉన్న రూమ్ ని కూడా తనిఖీ చేయడం జరిగింది. జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ కూడా పరిశీలించడం జరిగింది.ఈ తనిఖీ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్ జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.