వెల్దుర్తి సిరి న్యూస్ జనవరి 29: వెల్దుర్తి లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినీలకు బుధవారం డిజిటల్ వయస్సు లో చేతి వ్రాతపై తపాలా సంస్థ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలో 50 మంది విద్యార్థినీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెదక్ సౌత్ ఇన్స్పెక్టర్ సందీప్ కులకర్ణి మాట్లాడుతూ.. ఙాతీయ స్థాయిలో 18 సంవత్సరాలలోపు విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించడం జరుగు తుందని, జాతీయ స్థాయిలో మొదటి నలుగురికి రూ.50 వేలు, రెండవ స్థానం వారికి రూ .25 వేల, మూడవ స్థానం వారికి రూ. 10 వేలు,
హైదరాబాద్ పోస్టల్ సర్కిల్ లో మొదటి స్థానంలో వారికి రూ. 25 వేలు, రెండవ స్థానం వారికి రూ. 10 వేలు, ముాడవ స్థానం వారికి రూ. 5 వేలు నగదు ను అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమం లో పోస్ట్ మాస్టర్ మజర్, మేల్ ఓవర్సీల్ క్రిష్ణ , కస్తూర్బా పాఠశాల ఎస్ఓ ఫాతిమా, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.