సిపిఎం మహాసభలను విజయవంతం చేయాలి
రామయంపేట జనవరి 17 (సిరి న్యూస్)
సంగారెడ్డి జిల్లాలో జరగనున్న సిపిఎం 4వ మహా సభలను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి తెలిపారు.జిల్లా ఉపాధ్యక్షురాలు ఆధ్వర్యంలో రామాయంపేట పట్టణంలో సిపిఎం పార్టీ జెండాను ఎగరవేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన రైతులకు రుణమాఫీ సరిగ్గా చేయడం లేదన్నారు.గ్రామాలలో జిల్లాలో కార్మికులకు కనీస వేతనాలు కూడా పెంచడం లేదన్నారు.వీటన్నిటి విషయంలో నిరుపేదల ప్రజల కోసం సంగారెడ్డి జిల్లాలో ఈనెల 25 నుండి 28 వరకు మూడు రోజుల పాటు జరిగే సిపిఎం మహా సభలను జిల్లాలోని కార్మికులు, కర్షకులు,నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.