మానసిక వేదనతో బిపిఎం ఆత్మహత్య

సిరి న్యూస్ కొల్చారం : తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమవుతమవుతూ మానసిక వేదనకు గురై బిపిఎం ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మండల కేంద్రం కొల్చారం లో జరిగింది . ఏఎస్ఐ పారాసింగ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లంబాడి రవీందర్ (27 ) కొల్చారం పోస్ట్ ఆఫీస్ లో బిపిఎం గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

ఆసుపత్రులలో రూపాయల లక్షలు ఖర్చు చేసిన ఆరోగ్యం మెరుగు పడలేదు. శుక్రవారం ఉదయం కడుపులో నొప్పి వస్తుందని చెప్పి భరించలేక తన ఇంట్లో పురుగుల మందు తాగిన విషయాన్ని తన భార్య సంకుతో తెలుపగా ఆమె, కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తము 108 వాహనంలో మెదక్ ప్రభుత్వాసుపత్రికి పరిస్థితి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్ గ సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం అతడు మృతి చెందాడు .మృతునికి రెండు సంవత్సరాల కూతురు ఉంది. మృతుని భార్య సంకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తారా సింగ్ తెలిపారు .