సంగారెడ్డి, మే 14 (సిరి న్యూస్): కొనుగోలు కేంద్రాల్లో ట్రాన్స్పోర్ట్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. నేడు కొండాపూర్ పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలను పరిశీలన చేయటం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు. అకాల వర్షాల కారణం గా రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.తరుగు ఎక్కువ తీస్తున్న వారిపై చర్యలు తీసుకోవల్ని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు త్రాగునీరు అందుబాటులో రైతులకు సబ్సిడీ ద్వారా (టార్పాలిన్ కవర్) ప్రభుత్వం రైతులకు సరఫరా చేయాలని అన్నారు. లారీల రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తి మొత్తం గ్రౌండ్ సీసీ వెయ్యాలని అన్నారు.. కొనుగోలు చేసిన రైతుల ధాన్యాన్నికి వెంటనే డబ్బులు చెల్లించాలని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల సెక్రెటరీ కె.రాజయ్య, రైతులు ప్రజలు పాల్గొన్నారు.