బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన తపస్​

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన తపస్​

రామాయంపేట జనవరి 17(సిరి న్యూస్)
రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ బలపరిచిని ముగ్గురు అభ్యర్థులకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్​) మద్దతు ప్రకటించింది. శుక్రవారం హయత్​ నగర్​ లో తపస్​ రాష్ట్ర కమిటి, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి హన్మంతరావు, నవాత్ సురేష్ లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి కరీంనగర్​ – నిజామాబాద్​ – మెదక్​ – ఆదిలాబాద్​ ఉపాధ్యాయ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, ఉమ్మడి కరీంనగర్​ – నిజామాబాద్​ – మెదక్​ – ఆదిలాబాద్​ పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, ఉమ్మడి వరంగల్​ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి తపస్​ సమావేశానికి హాజరై ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తనను ఎమ్మెల్సీగా గెలిపించి ఉపాధ్యాయుల సమస్యలపై చట్టసభలో మాట్లాడేలా చేయడంలో తపస్​ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ బలపరిచిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా తపస్​ రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో మాట్లాడి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సమావేశం లో అభ్యర్థులు మల్క కొమరయ్య, సీ. అంజిరెడ్డి, పులి సరోత్తం రెడ్డి, ఏబీఆర్​ఎస్​ఎం ప్రతినిధులు లక్ష్మణ్ జీ, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకట్రావు, రాష్ట్ర పదాధికారులు నరేందర్ రావు, పాపిరెడ్డి, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శులు బండి రమేష్, తెల్కలపల్లి పెంటయ్య, రామకృష్ణ రెడ్డి లు పాల్గొన్నారు.